Joguramanna: ప్రజల పక్షాన నిలబడి పోరాడతాం: మాజీ మంత్రి జోగురామన్న

సిరా న్యూస్, ఆదిలాబాద్‌
ప్రజల పక్షాన నిలబడి పోరాడతాం: మాజీ మంత్రి జోగురామన్న
ఘ‌నంగా బీఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం
* పార్టీ జెండా ఆవిష్క‌ర‌ణ

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజల పక్షాన నిలబడి పోరాడతామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగురామన్న స్పష్టం చేశారు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కెసిఆర్ తెలంగాణ సాధన కోసం అవిశ్రాంత కృషి చేశారని పేర్కొన్నారు. శ‌నివారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేసి నినాదాలతో హోరెత్తించారు. అంతకుముందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ప్రొఫెసర్ జై శంకర్ చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. పార్టీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ నినాదాలు చేశారు. ఈ మేరకువారు మాట్లాడుతూ… తెలంగాణ పదాన్ని అసెంబ్లీ రికార్డులను నుండి తొలగించి, తెలంగాణ పెరేత్తితితేనే పార్టీల నుండి సస్పెండ్ చేసే రోజుల నుండి రాష్ట్రాన్ని సాధించే వరకు సాగిన ప్రస్థానంలో బీ.ఆర్.ఎస్ పార్టీ అత్యంత కీలక పాత్ర పోషించిందని అన్నారు. సమస్త ప్రజానీకం మద్దతుతో బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా స్వరాష్ట్ర సాధనకు పోరాడారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పే అంతిమ నిర్ణయమన్న ఆయన.. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని అన్నారు. పెన్షన్ దారులు, రైతులు, రైతు కూలీలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ఇక్కట్లు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజల పక్షాన నిలబడుతూ వారికి అండగా ఉండాలని శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.కార్యక్రమంలో నేతలు రోకండ్ల రమేష్,యూనుస్ అక్బని, అష్రఫ్, అలాల్ అజయ్, గండ్రత్ రమేష్ సాజిదోద్దీన్, రోకండ్ల రమేష్, లింగ రెడ్డి, రాం కుమార్, స్వరూప రాణి, బోడగం మమతా, పర్వీనా, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *