Joguramanna: వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్న బీజేపీ నాయ‌కులు:  మాజీ మంత్రి జోగురామన్న

సిరాన్యూస్, ఆదిలాబాద్‌
వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్న బీజేపీ నాయ‌కులు:  మాజీ మంత్రి జోగురామన్న
* ఆత్రం సక్కును భారీ మెజార్టీ తో గెలిపించాలి

ఎన్నిక‌ల్లో గెల‌వ‌క ముందే కొంత మంది బీజేపీ నాయ‌కులు వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్నార‌ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శ‌నివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని పలువురు బీజేపీ కీలక నేతల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీకి చెందిన ముగ్గురు కీలక నేతలు పాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపనీ లాగా మారి ఎన్నికల చందాలను వసూలు చేస్తున్నారన్న విషయం పత్రికల్లో వచ్చిందన్నారు. పాన్ గ్యాంగ్ గా ఏర్పడి లోక్ సభ ఎన్నికల వేల బీజేపీకి చెందిన ప్రధాన నేతలు వసూళ్ళకు పాల్పడుతూ వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో గెలవక ముందే ఇటువంటి పరిస్థితి ఉంటె గెలిస్తే ఏ విధంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు.గతంలోనూ వీరు పెద్ద ఎత్తున వ్యాపారాలు చేశారని, ఇతర దేశాల్లోనూ వీరికి వ్యాపారాలు ఉన్నాయని వివరించారు. స్వయంగా ఆర్ ఎస్ఎస్‌ లో ప్రాతినిధ్యం వహిస్తున్న బడా వ్యాపారులను లక్ష్యంగా చేసుకుంటూ బహిరంగ వసూళ్ళకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మరింత ప్రమాదకర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని అన్నారు. తాను ఎన్నికల్లో గెలిచినా ఓడినా.. ఎన్నడూ అవినీతికి పాల్పడలేదని, ఆ విషయం ప్రజలకు సైతం స్పష్టంగా తెలుసని అన్నారు. హిందూ సిద్ధాంతాలపై కనీస అవగాహనా లేని నేతలు బీజేపీలో చేరి రాజకీయాలు చేస్తుండడం సిగ్గుచేటని మండిపడ్డారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని అన్నారు. అయోధ్య రామ మందిరానికి తాను సైతం లక్ష రూపాయలను విరాళంగా అందించిన విషయాన్నీ గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యే మాత్రం కేవలం యాభై వేల రూపాయల విరాళాన్ని ఇవ్వడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. ఇటివల జరిగిన కాంగ్రెస్ పార్టీ ర్యాలిలో ఇంచార్జ్ మంత్రి సీతక్క ఉండి కూడా జనాలు రాలేదని, బీజేపీ ర్యాలీలో సైతం జనాలు కనిపించలేదని అన్నారు. తాము అధికారంలో లేనప్పటికీ కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. నెల రోజులుగా బీఆర్ఎస్ కార్యకర్తలు స్వచ్చందంగా పని చేస్తున్నారని, ఇంటింటి ప్రచారంతో హోరేత్తిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ ల ప్రధాన నేతలు డబ్బుల విషయంలోనే పోటాపోటీగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కును భారీ మెజారిటీ తో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వీజ్జగిరి నారాయణ, పట్టణ అధ్యక్షులు అజయ్, మాజీ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్ర‌హ్లాద్ , కోఆప్షన్ ఏజాజ్, రాజు, గెడం రాము,నయీమ్,పర్వీన్ సుల్తానా, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *