సిరాన్యూస్, జైనథ్
బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి జోగురామన్న
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గిమ్మ గ్రామంలో ఇటీవల పిడుగు పాటుతో కిరణ్, మంద సంటన్న మృతి చెందారు. శనివారం బాధిత కుటుంబాలను, ప్రమాదానికి గురైన కుటుంబాలను మాజీ మంత్రి జోగు రామన్న గ్రామానికి వెళ్లి పరామర్శించారు.చనిపోయిన వారి కుటుంబాలకు సహాయాన్ని అందించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రమాదానికి గురైన భోజన్న,రాములు,కోరెల్లి టిల్లు,వీరికి మెరుగైన వైద్యానికి సహాయాన్ని అందిస్తామన్నారు. ఆయన వెంట లింగారెడ్డి,గోవర్ధన్, ఉషన్న,పురుషోత్తం ఉన్నారు.