సిరాన్యూస్ , ఆదిలాబాద్
రైతులపై లాఠీచార్జి జరిపి ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చారు : మాజీ మంత్రి జోగురామన్న
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇటీవల విత్తనాల కొరత వల్ల అమాయకమైన రైతులపై లాఠీ ఛార్జ్ జరిపి అబద్దాలు ఆడుతున్న కాంగ్రెస్ పార్టీ నిజంగా 10 ఏండ్ల కిందటి ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చారన్నారని బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగు రామన్నఅన్నారు. గురువారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు రుణమాఫీ తో పబ్బం కట్టి అధికారం చేపట్టిన దొంగ హామీల కాంగ్రెస్ అని, ఇప్పుడు కనీసం విత్తనాలు కూడా పంపిణీ చేసే దీన స్థితిలో ఉందని మండిపడ్డారు. రైతులకు కావలసిన విత్తనాలను తక్షణమే అందుబాటులో ఉంచాలని అన్నారు. అలాగే రైతులకు ఇచ్చిన మాట ప్రచారంగా తక్షణమే వచ్చే పంటకు రైతుబంధు ఇవ్వాలని, అదేవిధంగా రైతు రుణమాఫీ తక్షణమే చేయాలని డిమాండ్ చేశారు. గత పదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం రైతును రాజు లాగా చూడగలిగినప్పుడు కేవలం 6 నెలల పాలనలో కాంగ్రెస్ ఎందుకు చూడలేకపోతుందన్నారు. ఇందిరమ్మ రాజ్యం తిచ్చి రైతుల ఇండ్లను ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి మరో ఉద్యమం చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్, ఖానాపూర్ ఇంచార్జి జాన్సన్ నాయక్ పాల్గొన్నారు.