సిరాన్యూస్, ఆదిలాబాద్
బీమన్న దేవుడికి పూజలు చేసిన మాజీ మంత్రి జోగురామన్న
భీమన్న దేవుడి చరిత్ర రానున్న తరాలకు సైతం అందించేలా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని జోగు రామన్న అన్నారు. పోతురాజుల విన్యాసాలు నృత్యాలు చరిత్రకు ఆడవాళ్ళని కొనియాడారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని గాంధీ పార్క్ లో గల ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బీమ్మన్నా బోనాల జాతరలో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొని భీమన్న దేవుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంఘ సభ్యులు జోగు రామన్న శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రసాదాన్ని అందజేశారు .జోగు రామన్న మాట్లాడుతూ రైతాంగం పాడే పరిశ్రమ సమృద్ధిగా పండి పుష్కలంగా వానలు కురవాలని భీమన్న దేవుడికి ప్రతి ఏటా ముదిరాజులు భక్తి శ్రద్ధలతో బోనాలు నిర్వహిస్తూ జాతర నిర్వహించడం వస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది అన్నారు. పోతురాజుల విన్యాసాలు వైవిధ్యమైన సంగీత నృత్యాలు భీమన్న దేవుడి సంస్కృతి ఘన చరిత్రను మరిన్ని తరాలకు అందజేసేలా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరం అన్నారు.