Joguramanna: ప్రశాంత జీవనాన్ని గడపాలి

సిరాన్యూస్‌, జైన‌థ్‌
ప్రశాంత జీవనాన్ని గడపాలి
మాజీ మంత్రి జోగురామన్న
* ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు

ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ప్రశాంత జీవనాన్ని గడపాలని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. శ‌నివారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గిమ్మ గ్రామంలోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో నిర్వహించిన పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మాజీ మంత్రి జోగురామన్న పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా  వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా సాగిన పూజాది క్రతువుల్లో పాల్గొని వారి ఆశీర్వచనాలను స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈసంద‌ర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *