సిరాన్యూస్, ఖానాపూర్
శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న భూక్యా జాన్సన్ నాయక్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని శ్రీరాంనగర్, ఎల్లాపూర్, గోసంపల్లె,గోడలపంపు గ్రామాల్లో బుధవారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణంలో బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.