సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
ఆత్రం సక్కును భారీ మెజార్టీతో గెలిపించాలి: నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్యా జాన్సన్ నాయక్
బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అత్రం సక్కును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గం ఇన్చార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ప్రధాన వీధులగుండా భూక్యా జాన్సన్ నాయక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.