సిరాన్యూస్,ఉట్నూర్
సిడాం శంభుకు నివాళుర్పించిన బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్
ఆదివాసీ ఉద్యమవీరుడు,తుడుందెబ్బ వ్యవస్థాపకులు, ఆదివాసీ ఐక్యవేధిక రాష్ట్ర అధ్యక్షులు సిడం శంభు వర్ధంతిని శనివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం మత్తడిగూడలో నిర్వహించారు. ఈ సందర్భంగా మత్తడిగూడలోని వారి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శంభు చిత్రపటానికి ఖానాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ భూక్య జాన్సన్ నాయక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ సీడాం శంభు ఆశయాలను కొనసాగిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఉట్నూర్ మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు, నియోజకవర్గ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.