సిరా న్యూస్, సామర్లకోట
వరద ప్రాంతాల్లో నిత్యావసరాల పంపిణీకి సిద్ధం : జాయింట్ కలెక్టర్ రాహుల్ మీన
* నాణ్యత,ప్యాకింగ్ పరిశీలన
జిల్లాలో భారీ వర్షాలు, ఏలేరు ప్రాజెక్ట్ వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రజలకు నిత్యవసర వస్తువులు పంపిణీకి సిద్ధం ఉన్నాయని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు. శుక్రవారం సామర్లకోటలోని ఏపీఎస్డబ్ల్యూసీ గోదా మును జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులతో కలిసి పరిశీలించారు. వరద బాధితులకు అందించేందుకు ప్యాకింగ్ చేస్తున్న వస్తువుల నాణ్యత గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ రాహుల్ మీనా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భారీ వర్షాలు, ఏలేరు వరద కారణంగా ముంపునకు గురైన బాధిత ప్రజలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 25 కిలోలు బియ్యం, పంచదార, కంద్దిపప్పు, బంగాళా దుంపలు, ఉల్లిపాయలు కిలో చొప్పున పిఠాపురం, గొల్లప్రోలు, యూ.కొత్తపల్లి, తొండంగి, ఏలేశ్వరం మండలాల పరిధిలోని గ్రామాలాల్లో పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. సిద్దం చేసిన వస్తువులు ఎప్పటికప్పుడు గ్రామాలకు తరలించి, బాధిత ప్రజలకు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి ఎంవీ ప్రసాద్, పౌరసరఫరాల సంస్థ డీఎం ఎం బాల సరస్వతి, టెక్నికల్ అసిస్టెంట్ విజయ్ రాజు, సామర్లకోట మండలం తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ సివిల్ సప్లయ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.