తాడేపల్లిగూడెంలో టీడీపీ,జనసేన ఉమ్మడి సభ

సిరా న్యూస్,విజయవాడ;
తాడేపల్లి గూడెం లో టిడిపి జనసేన ఉమ్మడి సభ నిర్వహిస్తున్నామని జనసేన నేత నాదేండ్ల మనోహర్అన్నారు. తాడేపల్లి గూడెం బహిరంగ సభలో వేదిక పై 500 మంది నాయకులు అసీనులు అవుతారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ప్రభుత్వ పాలన పై ప్రజల అసంతృప్తి నీ తమ గళం గా వినిపిస్తారని అన్నారు.
జగన్ పరిపాలనలో ప్రజలు విసిగి పోయారు. సీఎం జగన్ రెండు హెలికాప్టర్ లు ఎందుకు తెచ్చారు. దిగిపోయే ముందు రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసేందుకు హెలికాప్టర్ లు వాడుతున్నారు. ఎలక్షన్ కోసం పార్టీ కోసం రెండు హెలికాప్టర్ లు వాడుతారు. సీఎం జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ ల కోసం 25 కోట్ల ప్రజాధనం వృధా. సమగ్ర విచారణ జరగాలి.. అధికారులు బాధ్యత వహించాలి. ఆరు లక్షల మంది టిడిపి జనసైనికులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని నాదెండ్ల మనోహర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *