Jonnala Chandra Shekhar Gupta: కాంగ్రెస్‌లో చేరిన క‌డెం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జొన్నల చంద్ర శేఖర్ గుప్తా

సిరాన్యూస్‌, ఖానాపూర్‌
కాంగ్రెస్‌లో చేరిన క‌డెం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జొన్నల చంద్ర శేఖర్ గుప్తా
పార్టీలోకి ఆహ్వానించిన వెడ్మ బొజ్జు పటేల్

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం కడెం మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జొన్నల చంద్ర శేఖర్ గుప్తా పార్టీ కి రాజీనామా చేసి ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో క్యాంపు కార్యాలయంలో వారి అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారితో పాటు బిఆర్ఎస్ మండల బీసీ సెల్ అధ్యక్షులు ఒడ్నాల సత్తన్న, మాజీ సర్పంచ్ భర్త లచ్చన్న ఉప సర్పంచ్ శ్రవణ్ బెడద, మల్లయ్య మేకల శేఖర్,గంగాధర్, తదితరులు కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వారికీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సమిష్టిగా పని చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే సబ్బండ వర్గాల అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకార్షితులై బిఆర్ఎస్, బీజేపీ, ప్రజా ప్రతినిధులు,నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో క‌డెం మండల, ఖానాపూర్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *