సిరాన్యూస్, బోథ్
లోక్ అదాలత్ను విజయవంతం చేయండి : జూనియర్ సివిల్ జడ్జి హుస్సేన్
సెప్టెంబర్ 9న నిర్వహించనున్న లోక్ అదాలత్ను న్యాయవాదులు విజయవంతం చేసేందుకు కృషి చేయాలని జూనియర్ సివిల్ జడ్జి హుస్సేన్ కోరారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా బోద్ కోర్టు ఆవరణలో న్యాయవాదులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా జూనియర్ సివిల్ జడ్జి హుస్సేన్ మాట్లాడుతూ అదాలత్ ను విజయవంతం చేసేందుకు గాను ఎక్కువ కేసులను పరిష్కారమయ్యే విధంగా చూడాలన్నారు. రాజీమార్గమే రాజమార్గమని, కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరిగి డబ్బులు, సమయం వృథా కాకుండా రాజీద్వారా కేసులు పరిష్కరించేందు కు సహకరించాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వామన్ రావు దేశ్పాండే, న్యాయవాదులు కే శుభాష్, అంగతుకేంద్రీ ఠాకూర్, రూపేందర్ సింగ్, కుమ్మరి విజయ్, దమ్మబాల్, తదితరులు పాల్గొన్నారు.