సోనాలా, సిరా న్యూస్:
ఆదిలాబాద్ జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ కుమార్ ను వినతిపత్రం అందజేశారు. మంగళవారం జిల్లా గెజిటెడ్ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు చట్ల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నేరడిగొండలోని ఎమ్మెల్యే ఇంటిలో కలిశారు. నేరడిగొండ, బోథ్, బజార్ హత్నూర్, ఇచ్చోడ, గుడిహత్నూర్, తాంసి, తలమడుగు లో ఏడు జూనియర్ కళాశాలలు ఉన్నాయన్నారు. ఇందులో దాదాపు 3 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంటర్మీడియట్ వారికి మధ్యాహ్న భోజనం లేకపోవడంతో వారు సరిగా చదువుకోలేకపోతున్నారని వాపోయారు. వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని కోరారు.