కడప-రాయచోటి ఘాట్లో 6 కి.మీ. సొరంగ మార్గం

ఆకివీడు-దిగమర్రు రహదారికి రూ. 1,200 కోట్లు
హైవేల పనులకు రూ. 4,744 కోట్లతోవార్షిక ప్రణాళికకు మోర్త్ ఆమోదం
సిరా న్యూస్,అమరావతి;
కడప- రాయచోటి ఘాట్ రోడ్డు (గువ్వల చెరువు ఘాట్)లో వాహనదారుల కష్టాలు త్వరలో తీరనున్నాయి. ప్రమాదకరంగా ఉండే ఈ ఘాట్కు ప్రత్యామ్నాయంగా.. ఆ కొండకు సొరంగం తవ్వి, నాలుగు వరుసల రహదారి నిర్మించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఇందుకు రూ. 1,000 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్రంలో మొత్తంగా 14 జాతీయ రహదారులకు నిధులు మంజూరు చేసింది. రూ.4,744 కోట్లతో 2024-25 వార్షిక ప్రణాళికకు రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (మోర్త్) ఆమోదం తెలిపింది.* కర్నూలు-చిత్తూరు ఎన్హెచ్లో భాగంగా కడప-రాయచోటి మధ్య ఉన్న ఘాట్లో 6 కి. మీ. మేర సొరంగం నిర్మించనున్నారు. నాలుగు వరసల రహ దారికి వీలుగా ఒక్కటే పెద్ద సొరంగం గానీ, లేక రెండేసి వరసల రోడ్లకు రెండు సొరంగాలు గానీ తవ్వి.. రోడ్లు వేయనున్నారు. వీటికి ఇప్పటికే కన్స ల్టెంట్ను నియమించారు. ఆ సంస్థ వివిధ చోట్ల బోర్లు వేసి, ఆ కొండలో రాయి ఎక్కడెక్కడ గట్టిగా ఉందనేది అధ్యయనం చేస్తోంది. ఇది పూర్తయ్యాక ఎలైన్మెంట్ ఖరారు చేసి, డీపీఆర్ సిద్ధం చేస్తారు.
==

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *