సిరాన్యూస్, కడెం
కడెంలో ఘనంగా సీతారాముల కళ్యాణం
నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని రామాలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణానికి భక్తులు వేలాదిగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఆలయ కమిటీ వేసవిలో భక్తులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేశారు.