సిరా న్యూస్, కడెం:
కడెంకు పోటెత్తిన సందర్శకులు
+ బోటింగ్ చేస్తూ ఎంజాయ్
నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ సందర్శకులతో పోటెత్తింది. రెండు రోజులు వరుసుగా సెలవులతో రావడంతో పాటు పాటు జనవరి ఫస్ట్ కావడంతో స్థానికులే కాక, వివిద జిల్లాల నుంచి సందర్శకులు కడెం ప్రాజెక్ట్కు చేరుకొని ప్రకృతి అందాలను ఆస్వాధించారు. కడెం ప్రాజెక్ట్ వద్ద బోట్లు ఎక్కి ఎంజాయ్ చేసారు. సహ్యాద్రి కొండల అందం చూస్తూ మైమరచిపోయారు. కాగా ప్రాజెక్ట్ వద్ద ప్రస్తుతం ఊటీని తలపిస్తున్న వాతావరణం కనిపిస్తున్నదని పలువురు అన్నారు. అయితే ప్రభుత్వం మరింత శ్రద్ద చూపి, వసతులను మెరుగుపర్చాలని కోరారు. మరిన్ని బోట్లు ఏర్పాటు చేస్తే, సందర్శకులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.