సిరా న్యూస్, ఆదిలాబాద్:
విస్తృతంగా సేవా కార్యక్రమాలు…
కాలభైరవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ట్రస్ట్ డైరెక్టర్లు సందీప్ పోలాస్, మామిడి వెంకన్న, ఐతే గంగాధర్ లు తెలిపారు. ఈ మేరకు ఆదిలాబాద్ పట్టణంలో దుర్గామాత ఆలయ పీఠాధిపతి కిషన్ మహారాజ్ ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్ల పంపిణీ చేపట్టారు. అనంతరం ట్రస్ట్ డైరెక్టర్లు మాట్లాడుతూ… చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున నిరుపేదలు, నిరాశ్రయులైన వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో కుల, మతాలకు అతీతంగా నిరుపేదలకు సేవా కార్యక్రమాలు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని వారు తెలిపారు.