సిరా న్యూస్,పాతపట్నం;
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం టిడిపి అభర్ధిని మార్చకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ స్పష్టం చేశారు.వారం రోజుల్లో టిడిపి అధిష్టానం నిర్ణయం మార్చుకుని అభ్యర్థిని మార్చితే సరి..లేదంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని కలమట పేర్కొన్నారు.ఈ మేరకు పార్టీ అభిమానులు కార్యకర్తలు కలమట ఆత్మీయ సమావేశం నిర్వహించారు.నియోజకవర్గంలో పార్టీ టికెట్ నాకు కాదని నియోజకవర్గం తో సంబంధం లేని మామిడి గోవిందరావు కు కేటాయించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపి రామ్మోహన్ నాయుడు లు తమ స్వార్ధ రాజకీయాల కోసం తనను మోసం చేశారని ఆరోపించారు .బాబాయ్ అబ్బాయ్ లు గత ఐదేళ్లుగా తనను వాడుకుని వదిలేశారని ఆవేదన వ్యక్తంచేశారు.