మోసపూరిత కాంగ్రెస్ హామీలను ప్రజలు తిరస్కరించారు
బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్
జగిత్యాల/మల్యాల;
2024 పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించి 60 ఏళ్లు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ చరిత్రను తిరగరాసి భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ముచ్చటగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేయడం,
కరీంనగర్ మరియు సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్, కిషన్ రెడ్డి లకు మోడీ మంత్రివర్గంలో చోటు దక్కడం, తెలంగాణ రాష్ట్రంలో ఇంతింతై వటుడింతై అన్నట్లుగా బిజెపికి బలం పెరగడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కొండగట్టు పుణ్యక్షేత్రంలోని ఆంజనేయ స్వామికి బిజెపి నాయకులు 241 కమలం పూలతో ఆంజనేయస్వామికి అభిషేకం చేసి తలనీలాలు సమర్పించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్ మాట్లాడుతూ త్రేతాయుగంలో లోక కళ్యాణ కోసం ఋషులు,మునులు యజ్ఞ యాగాదులు చేయడానికి సంకల్పిస్తే శాకిని, డాకిని,తాటకి, మారిచుడు, సుభాహుడు లాంటి రాక్షసులు అడ్డు తగిలి తపస్సుకు భంగం కలిగించారని ప్రస్తుతం 2047 సంవత్సరం వరకు వికసిత్ భారత సంకల్పంతో దేశం కోసం నరేంద్రమోడీ అహర్నిశలు కృషి చేస్తుంటే జీర్ణించుకోలేక లౌకికవాదం ముసుగులో కొన్ని రాక్షస సంతతికి చెందిన రాజకీయ పార్టీలు ఎలాగైనా మోడీని అడ్డుకోవాలని తప్పుడు ప్రచారాలతో ఆచరణకు సాధ్యం కానీ హామీలతో గద్దెనిక్కాలని చూసిన పార్టీలు మోడీ చరిష్మా ముందు తట్టుకోలేదని అన్నారు. అయినా అంతిమంగా బిజెపి విజయం సాధించిందని అన్నారు. భారతదేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించడానికి అవకాశం కల్పించిన దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చినట్లు పాంచ్ న్యాయ్ పచ్చీసు గ్యారంటీల పేరుతో అధికారం కోసం అడ్డగోలుగా మోసపూరితమైన హామీలతో దేశంలో గద్దెనెక్కాలని చూసినా కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించలేదని అన్నారు. దేశం కోసం ధర్మం కోసం నరేంద్ర మోడీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని అన్ని రంగాల్లో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు శక్తిని ఇవ్వాలని ఆంజనేయ స్వామిని వేడుకలుకున్నట్టు తెలిపారు. 500 ఏళ్ల నుండి వివాదాస్పదమైన అయోధ్య రామాలయాన్ని నిర్మించిన మోడీ కలియుగ ఆంజనేయుడు అని వారికి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు.బీజేపీలో కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు దక్కుతుందని అందుకు ఉదాహరణ ఒక చాయ్ వాలాను మూడోసారి ప్రధానిని ఒక కార్పొరేటర్ ను కేంద్ర మంత్రిని చేయడం ఒక్క బీజేపీకే సాధ్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు..
======================