Kamala Nagaraju:వైసీపీ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం

సిరా న్యూస్ కుందుర్పి
వైసీపీ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం
అనారోగ్యంతో మరణించిన వైసీపీ కార్యకర్త కుటుంబానికి ఎంపిపి కమలా నాగరాజు ఆర్థిక చేయూత అందించారు. జంబుగుంపల పంచాయితీ కొలిమిపాల్యం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్య కర్త జి. మంజునాథ్ అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని ఎంపిపి కమల నాగరాజు పరామర్శించారు. మంజునాథ్ భార్య వరలక్ష్మికి ఎంపీపీ రూ.5000 ఆర్థిక సాయం అందించారు. వారి కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీ ఎల్లవేళలా అందుబాటులో అండగా ఉంటుందని చెప్పారు. ఆయ‌న వెంట‌ సచివాలయ మండల కన్వీనర్ ఈ. రాము, వైసీపీ నాయకులు రామప్ప, మచ్చేంద్ర, లింగప్ప, రామాచారి, ఓబన్న, చిన్న అనుమప్ప, ప్రతాప్, బొమ్మలింగ, రాజు, సురేష్ ఉన్నారు. ఎంపీపీ,జేఏసీ కన్వీనర్, వైసీపీ నాయకులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *