సిరాన్యూస్, శంకరపట్నం:
కన్నాపూర్ హైస్కూల్ ను సందర్శించిన ఏఐఎస్ఎఫ్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కనకం సాగర్
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్ హై స్కూల్ ను జిల్లా వైస్ ప్రెసిడెంట్ కనకం సాగర్ మంగళవారం సందర్శించారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకొని వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, విద్యార్థులకు ఒత్తిడి లేని ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంతోష్, ఆది, విజయ్, ఆకాష్ ఉన్నారు.