kandi srinivas:శివ‌య్య సేవ‌లో శ్రీ‌న‌న్న

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
శివ‌య్య సేవ‌లో శ్రీ‌న‌న్న
* శివాల‌యాల‌ను సంద‌ర్శించిన కంది శ్రీ‌నివాస రెడ్డి దంపతులు
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి శివ‌య్య సేవ‌లో త‌రించారు. లోక క‌ళ్యాణాన్నికాంక్షించి మ‌హా శివ‌రాత్రి ప‌ర్వదినాన్ని పుర‌స్క‌రించుకొని ఆయ‌న స‌తీమ‌ణి కంది సాయి మౌనా రెడ్డితో పాటు కాంగ్రెస్ శ్రేణుల‌తో క‌లిసి ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంతో పాటు జైన‌థ్ ,బేల మండ‌లాల‌లోని ప‌లు ప్ర‌సిద్ధి చెందిన ఆల‌యాల‌ను ద‌ర్శించి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. పార్వ‌తీ ప‌ర‌మేశ్వ‌రుల క‌రుణా క‌టాక్షాలు ప్ర‌జ‌ల‌పై ఉండాల‌ని వారంతా సిరి సంప‌ద‌ల‌తో సుఖ శాంతుల‌తో ఆయురాగ్యాల‌తో ఉండాల‌ని ఆయ‌న భ‌గ‌వంతున్ని ప్రార్థించారు. ఆయా ఆల‌యాల క‌మిటీ స‌భ్యులు ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికి శాలువాల‌తో స‌త్క‌రించి జ్ఞాపిక‌ల‌ను బ‌హుక‌రించారు. ఆల‌య క‌మిటీ స‌భ్యుల‌తో పాటు భ‌క్తులంద‌రికీ కంది శ్రీ‌నివాస రెడ్డి మ‌హాశివ‌రాత్రి శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం ఆయ‌న స్వ‌యంగా భ‌క్తులకు ప్ర‌సాదాన్ని వ‌డ్డించారు. ఆయ‌న వెంట డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి,జైనథ్ జడ్పీటీసీ తుమ్మ‌ల అరుంధతి వెంకట్ రెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, జిల్లా మ‌హిళా అధ్య‌క్షురాలు ఆశ‌మ్మ , నాగర్కర్ శంకర్, సునిల్,కోరేటి కిషన్,మానే శంకర్,ఎల్మ రాం రెడ్డి,పోతన్న, నాగన్న,బాయిన్ వార్ గంగా రెడ్డి,యాల్ల పోతా రెడ్డి త‌దిత‌రులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *