సిరాన్యూస్, ఆదిలాబాద్
కాంగ్రెస్లో పలువురు చేరికలు
* పార్టీలోకి ఆహ్వానించిన కంది శ్రీనివాసరెడ్డి
ఆదిలాబాద్ పట్టణంలోని తాటిగూడ కాలనీలో రషీద్ ఉల్ హక్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాలనీవాసులు సివిల్ ఇంజనీర్ ఫిరోజ్ఖాన్ తో కలిసి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కంది శ్రీనివాస రెడ్డి. కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు . కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి – వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, బాయిన్ వార్ గంగారెడ్డి, యాల్ల పోతారెడ్డి, ఎం.ఏ. షకీల్, రఫీక్, జాంటీ, నాగర్కర్ శంకర్, కోరేటి కిషన్, భోజా రెడ్డి, మానే శంకర్, ఎల్మ రామ్ రెడ్డి, పోతన్న, సయ్యద్ షాహిద్ అలీ, కయ్యుమ్ రజా, నాగన్న, కర్మ, మహమూద్, అస్బాత్ ఖాన్, మహమ్మద్ అభిద్,తలా చౌష్ కాలనీ వాసులు షేక్ నజీర్, ఉబెద్ యబా, షాహిద్, సమీర్, బషీర్, ఫిరోజ్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.