సిరా న్యూస్, ఆదిలాబాద్
కంది శ్రీనివాస్రెడ్డి సమక్షంలో పలువురు చేరిక
ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయం ప్రజాసేవ భవన్ లో శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని వార్డ్ నెంబర్ 10 రాంనగర్ కాలనీకి చెందిన మాజీ ఎంపీటీసీ జి.సాంబాజీ, బీ.సి నాయకులు ఏ. భాస్కర్ లతో పాటు పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికి కండువాలు కప్పి కంది శ్రీనివాస రెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం లో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.