Kandi Srinivasa Reddy: కే ఎస్ ఆర్ ను కలిసిన ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం సభ్యులు

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

కే ఎస్ ఆర్ ను కలిసిన ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం సభ్యులు

ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం ఆదిలాబాద్‌ జిల్లా సభ్యులు, కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాస రెడ్డి ని  మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఈ మేరకు ప్రజాసేవ భవన్ లో ఆయన్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాస రెడ్డికి పుష్పగుచ్చం అందించి, శాలువాతో సత్కరించారు. కే ఎస్ ఆర్ ను  కలిసిన వారిలో సంఘం రాష్ట్ర ఉపాద్యాక్షులు నల్ల రవీందర్, జిల్లా అధ్యక్షులు డి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సంతోష్, గౌరవ అధ్యక్షులు బాబులాల్, కోశాధికారి ఆడే సురేష్, సభ్యులు సచిన్, గోపాల్, షీమీ, బొమ్మెత సుభాష్, ప్రవీణ్, రోహిదాస్, శ్రీధర్, రఘునాథ్, గంగయ్య, అనిల్, విష్ణు, సందీప్, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *