సిరాన్యూస్, ఆదిలాబాద్
కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్ సాయి ప్రణయ్
* కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో పలువురు చేరికలు
* ఎంపీ అభ్యర్ధి ఆత్రం సుగుణ విజయానికి కృషి చేయాలి
రానున్న ఎన్నికలలో అంతా ఒకటై కష్టపడి పనిచేసి ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్ధి ఆత్రం సుగుణ విజయానికి కృషి చేయాలని అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజా సేవాభవన్ లో జరిగిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 3వవార్డు బీఆర్ ఎస్ కౌన్సిలర్ సాయి ప్రణయ్ తో పాటు ఆయన అనుచరులు ,తిలక్ నగర్, ఖానాపూర్ నుండి శంకర్, అభుజర్ , షేక్ ఫరీద్ ప్రజా సేవాభవన్ కు వచ్చి కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికి కండువాలు కప్పిన కెఎస్ఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. యువకుడైన కౌన్సిలర్ సాయి ప్రణయ్ కి ఎంతో ఉజ్వలమైన భవిష్యత్ ఉందన్నారు. అలాగే కష్టపడి పని చేసేవారిని కాంగ్రెస్ పార్టీ గుర్తించి తగినవిధంగా పదవులిచ్చి గౌరవిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా పాలన ,అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు జరిగిన లబ్దిని వివరించారు. కాంగ్రెస్ ప్ర భుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి పార్టీలో చేరుతున్నారని వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. అంతా కలసి పార్లమెంట్ అభ్యర్ధిని గెలిపించుకుంటే మన ఆదిలాబాద్ ను మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. పార్టీలో చేరిన 3వ వార్డ్ కౌన్సిలర్ సాయి ప్రణయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న ప్రజాపాలన ,సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు మంచి జరుగుతుందని తెలిపారు. కందిశ్రీనన్న నాయకత్వంలో పని చేసేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు సాయి ప్రణయ్ తెలిపారు. ఈకార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి – వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగర్కర్ శంకర్, బాయిన్ వార్ గంగా రెడ్డి, యాల్ల పోతా రెడ్డి, సింగిరెడ్డి రామ్ రెడ్డి, కోరేటి కిషన్, ఖయ్యుం, బండి దేవిదాస్ చారి, సుధాకర్ గౌడ్, తమ్మల చందు, ఉదయ్ కిరణ్, మహిపాల్ రెడ్డి, మహేందర్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.