సిరా న్యూస్, ఆదిలాబాద్:
బూత్ లెవెల్ కో-ఆర్డినేటర్ల సమావేశాన్ని విజయవంతం చేయాలి
ఎప్రిల్ 8 న సోమవారం, ఉదయం 9 గంటలకు అదిలాబాద్ పట్టణంలోని రత్నా గార్డెన్ లో నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్స్, కో-ఆర్డినేటర్ల సమావేశాన్ని విజయవంతం చేయాలని, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పార్లమెంట్ ఇంఛార్జి, జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క, ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్ కొప్పుల రాజు హాజరు కానున్నట్టు తెలిపారు. నియోజక వర్గంలోని కాంగ్రెస్ పార్టీ బూత్ ఏజెంట్లు, కో-ఆర్డినేటర్లు, ముఖ్య నేతలు, నాయకులు కార్యకర్తలంత పెద్ద ఎత్తున సకాలంలో కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన కోరారు.