సిరా న్యూస్, జైనథ్
రామున్ని మొక్కుతాం.. బీజేపీని తొక్కుతాం : ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి
జైనథ్లో ఆత్రం సుగుణ తరపున విస్తృత ప్రచారం
రాముడు అందరివాడని కేవలం బీజేపీ కి మాత్రమే దేవుడు కాదని, రాముడిని మొక్కుతాము ఎన్నికల్లో బీజేపీని తొక్కుతామని కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంఛార్జి గా తన భుజాలపై వేసుకుని నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం భోరజ్, సిర్సన్న, గూడ, రాంపూర్ , గిమ్మ, ఆకోలి,కేదార్ పూర్ ,కొరటా,పూసాయి,పిప్పర్ వాడ, మాండగడ, కామాయి, డొల్హారా లలో ప్రచారం అనంతరం భోజన విరామం తీసుకుని తిరిగి ఫౌజ్ పూర్ , తరోడ, హసీంపూర్, నిరాల, బాలాపూర్ ,ఆకుర్ల ,సావాపూర్, లేఖర్ వాడ, పెండల్ వాడ, సాంగ్వి, కౌట గ్రామాలలో రాత్రి వరకు ప్రచారం నిర్వహించనున్నారు. ప్రతీ గ్రామంలో ఆయనకు స్థానిక కాంగ్రెస్ శ్రేణులు , ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. మేము మీ వెంటే అంటూ మీ నాయకత్వంలో పని చేస్తామంటూ ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈసందర్భంగా కంది శ్రీనివాస రెడ్డి వారందరికి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ ఎన్నికలలో ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్ ల మధ్యే ఉండనుందని, బీఆర్ఎస్ ఇక్కడ బలహీనమైందని తెలిపారు. ఆపార్టీకి ఓటేసి మీ ఓటు వృధా చేసుకోవద్దని కంది శ్రీనివాస రెడ్డి ప్రజలను కోరారు. ఇక బీజేపీ కి ఓటేస్తే రిజర్వేషన్లు ప్రశ్నార్ధకమయ్యే అవకాశముందని తాము గెలిస్తే రిజర్వేషన్లు తీసేస్తామంటున్న బీజేపికి ఓటేయొద్దని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని గతం లో అధికారంలో ఉన్నప్పుడు భూములిచ్చిందని ,ఇంటి జాగాలిచ్చిందని , ఇండ్లించ్చిందని ప్రజలను కడుపులో పెట్టుకొని పరిపాలించిందని గుర్తు చేసారు. ప్రస్తుతం ప్రజల విశ్వాన్ని పొందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉందని దేశమంతా కాంగ్రెస్ ను ఆదరించి కేంద్రంలో కూడా ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ప్రజలు ఓట్లేసి గెలిపించాలని ఆయన పిలుపు నిచ్చారు.ఇక్కడ ఆదిలాబాద్ లో పార్టీ ఎంపీ అభ్యర్ధి ఆత్రం సుగుణ ఒక పేదింటి ఆడబిడ్డ అని మంచిగా చదువుకొని ప్రజా సేవ చేసేందకు తన ఉపాధ్యాయ వృత్తి కి రాజీనామా చేసి వచ్చిందని అందుకే ఆమెను గెలిపిస్తే తోటి ప్రజల సమస్యలను అర్ధం చేసుకుని వాటిని తీర్చేందుకు కృషి చేస్తుందని అన్నారు. చేతి గుర్తు కు ఓటేసి సుగుణక్కను పార్లమెంట్ కు పంపిస్తే మన కోసం అక్కడ తన గళాన్ని వినిపిస్తుందని తెలిపారు. ఆదిలాబాద్ అభివృద్ధి మీ చేతుల్లో ఉందని, మీరందరు సుగుణక్కను ఓట్లతో దీవిస్తే మనకంతా మంచే జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి , జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకట రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి , ఎన్ ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు శాంతన్ రావు ,కౌన్సిలర్ కలాల శ్రీనివాస్ , గడ్డం జగదీష్ రెడ్డి, అల్లూరి పోతారెడ్డి, వైద్య ఉమేష్ ,నిమ్మల ప్రభాకర్ , అల్లం లింగన్న, అల్లూరి అశోక్ రెడ్డి, సింగిరెడ్డి రామ్ రెడ్డి, అల్లూరి భూమారెడ్డి , దీపక్ రావు, రాజా రెడ్డి , ఆశారెడ్డి,ప్రకాష్ ,కపిల్, రాజీవ్ ,నల్మెల పోతారెడ్డి, రాజన్న , శ్రీనివాస్ ,ఖయ్యూం,షకీల్, సురేందర్ రెడ్డి, ఉదయ్ కిరణ్ , రాజేశ్వర్, నారాయణ ,అశోక్, రమేష్ ,తదితరులు పాల్గొన్నారు.