Kandi Srinivasa Reddy: కంది శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌జాసేవా భ‌వ‌న్‌లో సీఎం చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం

సిరా న్యూస్, ఆదిలాబాద్‌
కంది శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌జాసేవా భ‌వ‌న్‌లో సీఎం చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం
* కాంగ్రెస్ నాయ‌కుల సంబ‌రాలు
* రేవంత్‌రెడ్డికి జిల్లా రైతాంగం త‌రపున ధ‌న్య‌వాదాలు

రైతుల‌కు రెండు ల‌క్ష‌ల‌ రుణ‌మాఫీ చేస్తామ‌ని సీఎం రేవంత్‌రెడ్డి ప్ర‌కటించ‌డంపై కాంగ్రెస్ శ్రేణులు హ‌ర్షం వ్య‌క్తం చేశాయి. ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని కంది శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌జాసేవా భ‌వ‌న్‌లో శ‌నివారం సంబ‌రాలు జ‌రుపుకున్నారు. అనంత‌రం సీఎం రేవంత్‌రెడ్డి చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేశారు. ఈసంద‌ర్బంగా ప‌లువురు కాంగ్రెస్ నాయ‌కులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇచ్చిన మాట‌కు క‌ట్టుబడి పాల‌న సాగిస్తోంద‌న్నారు. ఇప్ప‌టికే గ్యారంటీ హ‌మీల‌ను ఒక్కోటిగా నెర‌వేరుస్తూ ప్ర‌జ‌ల విశ్వాసాన్ని చూర‌గొంద‌ని అన్నారు. ఆనాడు అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో వ‌రంగ‌ల్ రైతు డిక్ల‌రేష‌న్ స‌భ‌లో త‌మ ఏఐసీసీ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ ప్ర‌క‌టించిన విధంగా ఇప్పుడు ఏక‌కాలంలో రైతు రుణ‌మాఫీ చేస్తున్న‌ట్టు రాష్ట్ర మంత్రివ‌ర్గం నిర్ణ‌యం తీసుకోవ‌డం రైతుల‌కు పెద్ద ఊర‌ట క‌లిగించింద‌ని అన్నారు. యావ‌త్ తెలంగాణ రైతాంగానికి ఇది శుభవార్త అని తెలియ‌జేశారు. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం రెండు ద‌ఫాల్లో రుణ‌మాపీ చేస్తామ‌ని చెప్పి మాట త‌ప్పింద‌న్నారు. కానీ కాంగ్రెస్ స‌ర్కార్ గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం ఏర్పాటైన ఏడు నెలల్లోనే ఏకకాలంలో 31 వేల కోట్లతో రుణమాఫీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం గొప్ప విష‌య‌మ‌ని అన్నారు. రైతుకష్టం తెలిసిన వ్య‌క్తిగా, ఓ రైతుబిడ్డగా సీఎం రేవంత్‌రెడ్డి రైతుల సంక్షేమ‌మే ధ్యేయంగా ముందుకుసాగుతున్నార‌ని అన్నారు. రైతు ప‌క్ష‌పాతి ప్ర‌భుత్వంగా…రాష్ట్ర రైతుల ఆర్థికాభివృద్ధే ల‌క్ష్యంగా ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నార‌ని పేర్కొన్నారు. ఖ‌జానా ఖాళీగా ఉన్న‌ప్ప‌టికీ..రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిన‌ప్ప‌టికీ ఇచ్చిన హామీ మేర‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఏక‌కాలంలోనే రైతు రుణ‌మాఫీ చేస్తామ‌ని చెప్ప‌డం ఆయ‌న పాల‌న‌ద‌క్ష‌త‌కు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. చెప్పిందే చేస్తాం..చేసింది చెప్తామ‌ని, అదే కాంగ్రెస్ పార్టీ నైజ‌మ‌ని అన్నారు. గ‌త ప్ర‌భుత్వంలా గొప్ప‌లు చెప్పి..చిప్ప‌లు చూపించ‌డం త‌మ‌కు రాద‌ని ఎద్దేవా చేశారు. ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి నిల‌బ‌డ‌డ‌మే సీఎం రేవంత్‌రెడ్డి విధానం అని కొనియాడారు. రైతుల ఆర్థిక ప్ర‌యోజ‌నాల కోసం రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రిన్ని మంచి కార్య‌క్ర‌మాలు చేపడుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఈ కార్యక్రమంలో జైనథ్ జడ్పీటీసీ అరుంధతి -వెంకట్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్, మావల ఎంపీపీ దర్శనాల సంగీత -ఏవన్, కౌన్సిలర్లు కలాల శ్రీనివాస, ఆవుల వెంకన్న, సంద నర్సింగ్, రామేశ్వర్, జాఫర్ అహ్మద్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చరణ్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి, నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, బాయిన్ వార్ గంగా రెడ్డి, బండి దేవిదాస్ చారి, అల్లూరి అశోక్ రెడ్డి, పత్తి ముజ్జు, ఎం.ఏ షకీల్, పోరెడ్డి కిషన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *