సిరాన్యూస్,బేల
ఇది రైతు రాజ్యం :ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి
* రుణమాఫీలో చరిత్ర సృష్టించిన కాంగ్రెస్ ప్రభుత్వం
* బేల చప్రాలలో రైతుల సంబరాలు
* సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన కంది శ్రీనివాస రెడ్డి
ఒకేసారి 31 వేల కోట్ల రుణమాఫీ చేయడం చరిత్రలో మొదటిసారని, ఇది రేవంత్రెడ్డి సర్కార్కే సాధ్యమైందని, ఇప్పటివరకు ఏ రాష్ట్రంగానీ, ముఖ్యమంత్రిగానీ ఇలాంటి సాహసోపేత నిర్ణయమని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలకేంద్రంతోపాటు చప్రాల గ్రామంలో రైతు రుణమాఫీ సంబరాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ శ్రేణులు, చప్రాల గ్రామస్తులు కంది శ్రీనివాసరెడ్డికి డప్పు చప్పుళ్లు , మహిళల మంగళ హారతుల మధ్య పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు.డప్పుకొట్టి.. ఎడ్లబండి ఎక్కి సందడి చేశారు. శ్రేణులను ఉత్సాహపరిచారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు ,కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కంది శ్రీనివాస రెడ్డి పాలాభిషేకం చేసారు.ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..ఏకకాలంలోనే వేల కోట్ల రూపాయాలను రుణమాఫీ చేయడం చారిత్రాత్మకమని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఐదు గ్యారంటీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.రైతు రాజ్యమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, బాయిన్వార్ గంగారెడ్డి, ఎంఏ షకీల్, అల్లూరి అశోక్ రెడ్డి, గడ్డం జగదీష్ రెడ్డి, పోరెడ్డి కిషన్, బేల మండల కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు ఫైజల్లా ఖాన్, మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సంజయ్ గుండావార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వామన్ వాంఖడే, ఎస్.టి.సెల్ మండల అధ్యక్షులు మడావి చంద్రకాంత్, మాజీ సర్పంచ్ దౌలత్ రావు, ఆడే శంకర్, రూప్ రావు వాంఖడే, నాయకులు నానాజీ వైద్య, విలాస్ పాటిల్, హేమంత్ పాటిల్, సాగర్ టాక్రే, శంకర్ భోక్రే, నయాన్ వాంఖడే, అవినాష్ గోడే, విపిన్ టాక్రే, సోహాన్ ఖడ్సే భారీసంఖ్యలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.