సిరాన్యూస్, జైనథ్
మాజీ మంత్రి జోగు రామన్నకు సోదర వియోగం
* కుటుంబ సభ్యులను పరామర్శించిన కంది శ్రీనివాసరెడ్డి
* దీపాయిగూడలో జోగు పోతారెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామంలో మాజీ మంత్రి జోగు రామన్న సోదరుడు జోగు పోతారెడ్డి అనారోగ్యంతో చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి పోతారెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. మాజీ మంత్రి జోగు రామన్న తో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయకులు గిమ్మ సంతోష్, లోక ప్రవీణ్ రెడ్డి, కౌన్సిలర్లు సంద నర్సింగ్, భూమన్న, ఇమ్రాన్, నాయకులు ఎం. ఏ షకీల్, బాయిన్వార్ గంగారెడ్డి, యాల్ల పోతా రెడ్డి, అల్లూరి భూమారెడ్డి, దేవిదాస్ చారి, అల్లూరి అశోక్ రెడ్డి, పుండ్రు ప్రవీణ్ రెడ్డి, ఏనుగు ప్రమోద్ రెడ్డి, అల్లూరి సతీష్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, హరీష్ రెడ్డి, బండారి చిన్నయ్య, తమ్మలవార్ చందు, సింగిరెడ్డి రామ్ రెడ్డి, యెల్టీ భోజారెడ్డి, ఎం.ఏ కయ్యుమ్, తదితరులు పాల్గొన్నారు.