సిరాన్యూస్,ఆదిలాబాద్
కేటీఆర్ మహిళలకు క్షమాపణలు చెప్పాలి : కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి
* కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం
మహిళలను కించపరిచిన కేటీఆర్ వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం ఆవరణలో కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. అనంతరం కేటీఆర్ ఫ్లెక్సీని దహనం చేసారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఓడించి బుద్ధి చెప్పినా ఇంకా బీఆర్ ఎస్ నేతల తీరు మారలేదని విమర్శించారు. బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలకు బస్సులు పెంచి బ్రేక్ డ్యాన్సులు , రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోమనండి అన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఆయన మండి పడ్డారు. తమ ప్రభుత్వం మహళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే బీఆర్ఎస్ నాయకులు చూసి ఓర్వలేక పోతున్నారని అందుకే ఇలా వారి మనోభావాలు దెబ్బతినేలా కించ పరిచేలా వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు. మహిళలను కించపరిచిన కేటీఆర్ వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నియోజక వర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.