సిరా న్యూస్, ఆదిలాబాద్:
అభివృద్ధి పనులకు కంది శ్రీనివాస రెడ్డి భూమి పూజ
ఆదిలాబాద్ జిల్లా జైనథ్, బేల మండలాల్లోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టి నియోజక వర్గ ఇంచార్జీ కంది శ్రీనివాస రెడ్డి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసారు. మంగళవారం ముందుగా జైనథ్ మండల కేంద్రంలోని అతి ప్రాచీన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మండల కేంద్రంలో రూ. 25లక్షల ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి నాయకులు, అధికారులతో కలిసి భూమి పూజ చేసారు. అనంతరం జైనథ్ మండలం ఖాప్రిలో సర్పంచ్ ఎల్టి రమీల వెంకట్ రెడ్డితో కలిసి రూ. 10లక్షల పనులకు, కరంజిలో రూ. 8లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ నిర్వహించారు. అక్కడి నుండి బేల వెళ్లిన ఆయన పలు సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి సైతం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన నెలల వ్యవధిలోనే సంక్షేమ బద్దంగా పాలన సాగిస్తూ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రేస్ ప్రభుత్వం ప్రజల మన్ననలను పొందుతున్నదని అన్నారు. కాంగ్రేస్తోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని, గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషీ చేస్తున్నదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటీసీ తుమ్మల అరుంధతి వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ మంచికట్ల ఆశమ్మ, ఎంపిటీసీ కొడిచర్ల సుదర్శన్, నాయకులు కామ్రే మనోజ్, గిమ్మ సంతోష్, పోతరెడ్డి, బాయిన్వార్ గంగారెడ్డి, గడ్డం జగదీశ్ రెడ్డి, అల్లూరి అశోక్ రెడ్డి, పూండ్రు రవికిరణ్ రెడ్డి, బద్దం సురేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.