Kandi Tirupati Reddy: వెలిచాల రాజేందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించండి

సిరాన్యూస్‌, చిగురుమామిడి
వెలిచాల రాజేందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించండి
*మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి
* నవాబ్ పేటలో కాంగ్రెస్ నాయకుల విస్తృత‌ ప్రచారం

.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు భారీ మెజార్టీతో గెలిపించాల‌ని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి అన్నారు. శ‌నివారం చిగురుమామిడి మండలంలోని నవాబ్ పేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సంద‌ర్భంగా ముఖ్యఅతిథిగా మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి హాజరయ్యారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు, అభివృద్ధి పనుల గురించి ఉపాధి హామీ కూలీలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజవర్గ మైనార్టీ ఇన్చార్జ్ ఎండి షాబుద్దీన్, మండల ఉపాధ్యక్షుడు ఠాగూర్ నరేందర్ సింగ్, మండల సోషల్ మీడియా కన్వీనర్ బోయిని వేణుగోపాల్, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు కాంతాల మైపాల్ రెడ్డి,మండల యూత్ నాయకుడు గొట్టే రఘుబాబు, గ్రామ బీసీ సెల్ అధ్యక్షుడు పిల్లి కొమురయ్య, గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోయిని దుర్గయ్య , గ్రామ మైనార్టీ సెల్ ఎండి కాసిం, గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు కోక్కేస శ్రీనివాస్ గౌడ్, గ్రామ నాయకులు ఠాగూర్ దిలీప్ సింగ్, బోయిని వంశీ కృష్ణ, గూళ్ల శ్రావణ్, తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *