Kandula Gajendar: నిర్ణీత ధరకే పుస్తకాలను విక్రయించాలి…

సిరా న్యూస్, ఆదిలాబాద్:

నిర్ణీత ధరకే పుస్తకాలను విక్రయించాలి…

+ ప్రైవేటు పుస్తక విక్రయ షాపులను తనిఖీ చేసిన కందుల గజేందర్ 

+ పక్కాగా రిజిస్టర్లు నిర్వహించాలని ఆదేశం

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణీత ధర మేరకు మాత్రమే పాఠ్యపుస్తకాలను విక్రయించాలని జిల్లా నోడల్ అధికారి కందుల గజేందర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు పుస్తక విక్రయ షాపులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాపుల్లో నిలువ ఉన్న పుస్తకాలు, అమ్మిన పుస్తకాలకు సంబంధించిన పలు రిజిస్టర్ లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… పుస్తకాల విక్రయాలకు సంబంధించిన పూర్తి రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలను విక్రయించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *