సిరా న్యూస్, కందుర్పి:
కందుర్పి ఎంపిడీవోగా ఎం చంద్రశేఖర్
అనంతపూర్ జిల్లా కందుర్పి ఎంపిడీవోగా ఎం చంద్ర శేఖర్ శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. కర్నూల్ జిల్లా కోడుమూర మండలం నుండి కందుర్పికి బదిలీపై వచ్చిన ఆయనకు మండల పరిషత్ సిబ్బంది పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపిడీవో చంద్ర శేఖర్ మాట్లాడుతూ… మండలంలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషీ చేస్తానని అన్నారు.