Kangaroopur: కంగారుపూర్‌లో ఆరు ఇసుక ట్రాక్టర్లు ప‌ట్టివేత‌

సిరాన్యూస్, బేల‌
కంగారుపూర్‌లో ఆరు ఇసుక ట్రాక్టర్లు ప‌ట్టివేత‌

ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని కంగారుపూర్ గ్రామంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఆరు ట్రాక్టర్లను మైనింగ్ అధికారులు ప‌ట్టుకున్నారు. పక్క సమాచారంతో బేల మండలంలోని కంగార్పూర్ గ్రామ సమీపాన ఫైన్ గంగా నదిలోని అక్రమంగా ఇసుక త‌ర‌లిస్తున్నార‌న్న సమాచారంతో  మైనింగ్ అధికారులు అక్కడికి చేరుకొని ఆరు ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేశారు. ట్రాక్టర్ యజమానులు జరిమానా కట్టిన తర్వాతానే  వాహనాలను విడిపించుకోవాలని తెలిపారు. అక్రమంగా మట్టి , ఇసుక తరలింపులను పాలు పడితే చర్యలు తప్పవని హెచ్చ‌రించారు. అలాగే లైసెన్సులు లేకున్నా ఇటుక బ‌ట్టీలు నడిపిస్తున్న వారి పైన కూడా కఠిన చర్యలు తప్పవని తెలిపారు. అనంతరం బేల‌ పోలీస్ స్టేషన్ లో భూగర్భ శాఖ అధికారులు ఆరు ట్రాక్టర్లను బేలా ఏఎస్సై లింగన్న‌కు అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *