Kanuganti Lakshmipati: నేత్రదాత కానుగంటి లక్ష్మీపతికి సంస్మరణ సభ

సిరాన్యూస్‌, ఓదెల‌
నేత్రదాత కానుగంటి లక్ష్మీపతికి సంస్మరణ సభ
* నేత్రదాత కుటుంబ సభ్యులకు అభినందన ప‌త్రం అంద‌జేత‌

నేత్రదాత కానుగంటి లక్ష్మీపతి సంస్మరణ సభ స్వగృహం పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రము లో నిర్వహించారు..ఇటీవల లక్ష్మీపతి మృతి చెందగా, వారి నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేసి ఇద్దరు అంధులకు చూపునిచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వారి నివాసంలో నేత్రదాత సంస్మరణ సభను సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి మెర్గు భీష్మాచారినేత ఆధ్వర్యంలో నిర్వహించారు. నేత్రదాత కుటుంబ సభ్యులకు అభినందన పత్రాన్నిఅంద‌జేశారు. ఈ సందర్భంగా నేత్ర, అవయవ, దేహాదానంపై అవగాహన కల్పించారు. నేత్రదాత కుటుంబాన్ని అభినందించి, నేత్రదాత కు ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోడ్ర.వేణు క్యాతం మల్లేశం, డాక్టర్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు, బైరి, వినోద్ ,నవీన్. గోపతి., తిరుపతి, బియ్యాల సత్యం పాల్గొన్నారు.వీరిని ఫౌండేషన్ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి ప్రచార కార్యదర్శి కె.ఎస్.వాసు భీమనపల్లి పృథ్వీరాజ్ చంద్రమౌళి జిల్లా అధ్యక్షులు రాజమౌళి అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *