సిరా న్యూస్,లక్నో;
ఇద్దరు యువతులు పరస్పర అంగీకారంతో తమ భర్తలను మార్చుకున్నారు. నాలుగేళ్ల పాటు ఈ బంధం కొనసాగింది. అంతా సజావుగా సాగింది కూడా. సీన్ కట్ చేస్తే.. ఓ యువతి తన భర్త వివాహేతర బంధంలో ఉన్న మహిళను పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలంటూ లఖ్నవూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది.బహ్రైచ్కు చెందిన ఓ యువతికి.. 2019లో ఓ యువకుడితో వివాహమైంది. వారిద్దరూ ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇక నాలుగేళ్ల క్రితం సదరు యువతి.. తన భర్తతో కలిసి స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో స్నేహితురాలి భర్త కూడా అక్కడే ఉన్నాడు. నలుగురు కలిసి సరదాగా గడిపారు. క్రమంగా వీరి మధ్య చనువు మరింత పెరిగింది. అదే సంవత్సరం డిసెంబర్ ఈ రెండు జంటలు కలిసి క్రిస్మస్ పార్టీ జరుపుకున్నారు. ఈ కోవలోనే స్నేహితురాలిద్దరూ తమ భర్తలను మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. పరస్పర అంగీకారంతో ఈ బంధం నాలుగేళ్ల పాటు సజావుగా సాగింది.కానీ చిక్కు ఎక్కడొచ్చిందంటే.. బహ్రైచ్ యువతి భర్త తన భార్య స్నేహితురాలితో ప్రేమలో పడ్డాడు. ఇది కాస్తా అతడి భార్యకు తెలిసింది. ఈ విషయంపై భర్తను, స్నేహితురాలిని నిలదీసింది. దీంతో రెండు జంటల మధ్య గొడవలు పెరిగాయి. విడాకులు తీసుకోకుండా తన భర్త.. మరో మహిళను వివాహం చేసుకున్నాడని బహ్రైచ్ యువతి ఆరోపించింది. పలుసార్లు భర్తతో గొడవపడింది. అంతేకాకుండా అతడిపై కేసు పెట్టింది. దీంతో బహ్రైచ్ యువతి భర్త లఖ్నవూ ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశాడు. ఆ తర్వాత దంపతులిద్దరికీ కౌన్సిలింగ్ ఇప్పించింది ఫ్యామిలీ కోర్టు. అయితే ఆమె భర్త ఏమో.. భార్యను బెదిరించడానికే మరో మహిళను పెళ్లి చేసుకున్నట్టు చెప్పానని.. నిజానికి తాను ఎవ్వరిని పెళ్లి చేసుకోలేదని చెప్పాడు. ప్రస్తుతం వీరిద్దరి కేసు విచారణ కోర్టులో సాగుతోంది.