సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్
నక్కల వాగులో గల్లంతైన కారోబార్ చెప్పాల పవన్ మృతి
వాగులో గల్లంతైన కారోబార్ మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మిర్ఝంపేట గ్రామపంచాయతీ కారోబార్ చెప్పాల పవన్ ఆదివారం విధులు ముగించుకొని స్వగ్రామమైన కాల్వ శ్రీరాం పూర్ కు వెళ్తున్నారు. భారీ వర్షానికి మార్గమధ్యలో కొత్తపెళ్లి శివారులోని నక్కల వాగు రోడ్డుపై పొంగి ప్రవహిస్తుంది. ఈ క్రమంలో కారోబార్ చెప్పాల పవన్ వాగును దాటే ప్రయత్నం చేయగా ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం నీటిలో పడిపోయింది. ద్విచక్ర వాహనాన్ని పట్టుకునే క్రమంలో కారోబార్ చెప్పాల పవన్ నీటి ప్రవాహానికి కొట్టుకపోయాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసు సిబ్బందికి సమాచారం అందించారు. సోమవారం సింగరేణి ఎన్టీఆర్ బృందం నక్కల వాగులో పవన్ మృతదేహాన్ని వెలికి తీశారు.