ఎమ్ఎల్యే ప్రకాష్ గౌడ్ పై కార్తీక్ రెడ్డి ఫైర్

సిరా న్యూస్,రంగారెడ్డి;
కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరిన రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పై బీఆర్ఎస్ సీనియర్ నేత కార్తీక్ రెడ్డి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. నియోజకవర్గం లోని విలువైన ప్రభుత్వ భూములపై కన్నేసిన కొందరు వాటిని కబ్జా చేయాలని దురుద్దేశంతోనే అధికార పార్టీలోకి జంప్ అయ్యారని కార్తీక్ రెడ్డి పరోక్షంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పై సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని ప్రకటించారు. శంషాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కార్తీక్ రెడ్డి… ప్రకాష్ గౌడ్ పార్టీ ఫిరాయించాలని తీవ్రంగా తప్పుపట్టారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో రాజేంద్రనగర్ నియోజకవర్గం అభివృద్ధికి 4500 కోట్లు కేటాయించారని స్వయంగా ప్రకటించిన ప్రకాష్ గౌడ్ ఇప్పుడు ఏమి ఆశించి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు ప్రజలకు సమాధానం చెప్పాలని కార్తీక్ రెడ్డి కార్తీక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కేవలం కేసీఆర్ ముఖం చూసి ఓట్లు వేసి ఎమ్మెల్యేలుగా గెలిపించారు తప్ప వారిని చూసి కాదని కార్తీక్ రెడ్డి పరోక్షంగా ప్రకాష్ గౌడ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయించిన నేతలందరికీ ప్రజలే తగిన రీతిలో గుణపాఠం చెబుతారని ఆయన జోస్యం చెప్పారు.
========================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *