సిరాన్యూస్,భీమదేవరపల్లి
జగ్జీవన్ రావు జయంతిని విజయవంతం చేయండి: కరుణాకర్
ఈనెల 5న భీమదేవరపల్లి క్రాస్ వద్ద నిర్వహించే డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ 116వ జయంతిని విజయవంతం చేయాలని బాబు జగ్జీవన్ రావు విగ్రహ కమిటీ చైర్మన్ పచ్చునూరి కరుణాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 14 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం బాబు జగ్జీవన్ రావు జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ దేశానికి తొలి ఉప ప్రధానిగా అనేక సేవలు అందించారన్నారు. దళిత సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ ప్రజా నాయకులు ప్రభుత్వ నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.కార్యక్రమంలో చాగంటి వెంకటేశ్వర్లు, ఎలుక పెళ్లి శ్రీనివాస్, సాతూరి చంటి, రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.