కరుణాకర్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు…

తిరుపతి ప్రజల ఆగ్రహంలో రాజారెడ్డి పెద్ద, పిల్ల కలుపు మొక్కలు కొట్టుకు పోవడం ఖాయం...
ఆరణి శ్రీనివాసుసలు
సిరా న్యూస్,తిరుపతి;
కరుణాకర్ రెడ్డి మతి భ్రమించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని తెలుగుదేశం…బిజేపి బలపరుస్తున్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసలు విమర్శించారు. కడపలో పిక్ పాకెటర్ గా బతికిన నువ్వు అక్కడ తన్ని తరిమితే తిరుపతికి వచ్చిన నువ్వు నన్ను జేబు దొంగ అనే అర్హత లేదని ఆయన అన్నారు. 18వ డివిజన్ లో ఆరణి శ్రీనివాసులు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. టిడిపి క్లస్టర్ ఇన్చార్జీ మబ్బు దేవనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం జరిగింది.
ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ కరుణాకర్ రెడ్డి జేబు దొంగ అని తనను విమర్శించడం నవ్వు తెప్పిస్తోందని అన్నారు. కడపలో పిక్ ప్యాకెటెరైన కరుణాకర్ రెడ్డిని అక్కడి వాళ్ళు తన్నితరిమితే తిరుపతిలో వచ్చి పడ్డాడని ఆయన ఆరోపించారు. తిరుపతిలో రాజారెడ్డి నాటిన పెద్ద మొక్క పని అయిపోయిందని పిల్ల మొక్కను దింపారని కానీ ప్రజాఆగ్రహంలో పిల్ల మొక్క కొట్టుకుపోవడం ఖాయమని ఆయన అన్నారు. చిత్తూరు మున్సిపాల్టీలో పది నుంచి పదిహేను సార్లు టెండర్లు పిలిచినా ఎవరూ రాకపోతే ఎమ్మెల్యేగా నేను 85కోట్ల రూపాయల పనులు చేస్తే ఈరోజుకు దిక్కులేదని ఆయన చెప్పారు. కాంట్రాక్టర్స్ కు డబ్బులు చెల్లించలేని చేతకాని ప్రభుత్వం నీ నాయకుడు నడుపుతున్నాడని ఆయన విమర్శించారు. ఏమి తెలుసుకోకుండా అక్కసుతో మతిభ్రమించి మాట్లడుతున్న కరుణాకర్ రెడ్డి మెంటల్ హాస్పిటల్ లో చూపించుకుంటే బాగుంటందని ఆయన అన్నారు. నాకు రాజ్యసభ ఇస్తామని చెప్పి మాటతప్పి…మడమ తిప్పింది జగన్మోహన్ రెడ్డి అని ఆయన విమర్శించారు. అవినీతి మరక అంటని నాయకుడు పవన్ కళ్యాణ్ అటువంటి నాయకుడికి ముప్పయ్ కోట్లు ఇచ్చి సీటు తీసుకోవాల్సిన అవసరం నాకు గాని పవన్ కళ్యాణ్ కుగాని లేదని ఆయన స్పష్టం చేశారు. వంటినిండా విషం నింపుకున్న కరుణాకర్ రెడ్డిని ఆయన కొడుకుని తిరుపతి ప్రజలు రాజకీయంగా సమాధి చేయడం ఖాయమని ఆరణి శ్రీనివాసులు స్ఫష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *