సిరా న్యూస్, జైనథ్
మండలాన్ని అభివృద్ధి చేయండి
* జైనథ్ మండల బిజెపి అధ్యక్షుడు కట్కాం రాందాస్
* ఎంపీడీవోను సన్మానించిన బిజెపి నాయకులు…
మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని జైనథ్ మండల బిజెపి అధ్యక్షుడు కట్కాం రాందాస్ అన్నారు. నూతనంగా జైనథ్ మండల ఎంపీడీవో గా బాధ్యత స్వీకరించిన ఏ రవీంద్రనాథ్ ను గురువారం బిజెపి మండల నాయకులు శాలువాతో సన్మానించారు. మండలంను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జైనథ్ మండల బిజెపి అధ్యక్షుడు కట్కా0 రాందాస్, ప్రతాప్ యాదవ్, శాలిక్, బండి రవి యాదవ్, గొడుగుల సత్యనారాయణ, బిక్కి సంతోష్, తదితరులు పాల్గొన్నారు.