సిరా న్యూస్, జైనథ్
గెడం నగేష్ను భారీ మెజార్టీతో గెలిపించాలి
* బీజేపీ మండల అధ్యక్షులు కట్కం రాందాస్
భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి గెడం నగేష్ను భారీ మెజార్టీతో గెలిపించాలని బీజేపీ మండల అధ్యక్షులు కట్కం రాందాస్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని మoడగడ గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కట్కం రాందాస్, కార్యదర్శి కర్ణాకర్ రెడ్డిలకు గణేశ్,ఆశన్నలు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రపంచ దేశాలే మోడీని గర్విస్తున్న వేళ కోవిడ్ 19 తో ప్రజలను కాపాడుకున్న రోజు నేటికీ గుర్తొస్తాయన్నారన్నారు.మన హిందు సంస్కృతి, కట్టు బొట్టు, సాంప్రదాయాలు ఉన్నాయంటే అది కేవలం కాషాయ జెండాకే సాద్యం అన్నారు. ఎంపీ అభ్యర్థి గేడం నగేష్ను గెలిపించాలంటూ ఇంటింటా తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. జైశ్రీరామ్…భారత్ మాతాకీ జై నినాదాలు చేస్తూ వీధుల గుండా తిరిగి డప్పు చప్పులతో ప్రచారం కొనసాగించారు .కార్యక్రమంలో బీజేపీ నాయకులు మండల ఉపాధ్యక్షులు రమేష్, సుభాష్, లింగన్న, శ్రీనివాస్ ,స్వామి తదితరులు పాల్గొన్నారు.