సిరా న్యూస్,హైదరాబాద్;
ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఊహించిందేనని ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. బీజేపీ, బిఆర్ఎస్ కుమ్మక్కుతోనే బెయిల్ వచ్చింది. మొన్నటి వరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ ను దెబ్బతీయాలని చూసారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు అయ్యి బిజెపి కి బిఆర్ఎస్ దాసోహం అయ్యింది . హరిశ్, కేటిఆర్ లు ఢిల్లీలో బీజేపీ నేతల చుట్టూ ఆపద మొక్కులు మొక్కారు. బీజేపీ నేతల ఇళ్ల చుట్టూ తిరిగి కాళ్ళ మీద పడి కవితకు బెయిల్ తెచ్చుకున్నారు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి.. బీజేపీ, బిఆర్ఎస్ లు కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయి. బీజేపీ లో బిఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలు అవుతుంది. ఇంకా బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం ఒక్కటే మిగిలిందని అన్నారు.
=