సిరాన్యూస్, మానకొండూర్
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో ఇటీవల టాంకర్ బోల్తా పడి రోడ్డు ప్రమాదంలో పూదరి శ్రీనివాస్ మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బుధవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శ్రీనివాస్ పిల్లలను ఓదార్చి వారిని అన్ని విధాలుగా ఆదుకుంటానని భరోసా కల్పించారు. ఎమ్మెల్యే వెంట గ్రామస్తులు ,ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.