సిరా న్యూస్, మానకొండూర్
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పార్లమెంటు ఎన్నికలు జరిగిన తీరును, ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. అలాగే మానకొండూరు నియోజకవర్గ అభివృద్ధి గురించి, పలు సమస్యలపై చర్చించినట్లు తెలియజేశారు.