Kavvampally Satyanarayana: విద్యార్థి గొర్రె అంజన్‌కు రూ.50వేలు అంద‌జేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

సిరాన్యూస్,శంకరపట్నం:
విద్యార్థి గొర్రె అంజన్‌కు రూ.50వేలు అంద‌జేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి గొర్రె అంజన్ కేరళలోని ఎన్ఐటీ కాలికట్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షలకు ఫీజు కట్టే ఆర్ధిక స్థోమత లేకపోవడంతో  మానకొండూర్ ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణను సంప్రదించారు. వెంట‌నే స్పందించిన‌ ఆయన వెంటనే రూ.50వేల ఆర్థిక సహాయం అందించారు. చదువు పూర్తి అయ్యే వరకు అన్ని విధాలుగా ఆదుకుంటానని భరోసా కల్పించారు.విద్యార్థులతో మాట్లాడుతూ బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగి మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *